Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో బంగారం ఆల్‌టైమ్ రికార్డు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (13:00 IST)
దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు ధర నమోదు చేసింది. బుధవారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,829కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ.67 అధికం. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలో కొత్త రికార్డు నమోదైనట్లయింది. 
 
ఇకపోతే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల గరిష్టానికి చేరిన నేపథ్యంలోనే ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ.49 వేలను దాటి ముందుకు సాగుతుందని వెల్లడించారు.
 
అలాగే, ఔన్సు బంగారం ధర బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లో 1,801 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా రెండో దశ కేసులు పలు దేశాల్లో విజృంభిస్తున్న వేళ, తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ సేఫ్‌గా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తూ ఉండటంతోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments