Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : పడిపోతున్న బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (08:15 IST)
దేశంలో బంగారం, వెండి ధరలు క్రమేణా తగ్గిపోతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలు కావడంతో ఆ ప్రభావం బంగారం విక్రయాలపై కూడా ఉంది. ఫలితంగా మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి ఆభరణాల ధరలు తగ్గిపోతున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారానికి డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. 
 
రెండు రోజుల క్రితం గ్రాముకు రూ.300 మేరకు తగ్గిన బంగారం ధర శుక్రవారం మరో రూ.300 మేరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.47,847కు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,828కి పడిపోయింది. 
 
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.210 తగ్గి, 49040గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44950కి చేరుకుంది. అలాగే, విజయవాడ నగరంలో హైదరాబాద్ నగరంలో ఉన్న దరలే ధరలే కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments