Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్కో మెగా షోరూమ్‌లో సందడి చేసిన ఆర్కె రోజా

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (23:16 IST)
యువత చేనేత వస్త్రాలను ధరించటం ద్వారా ఆరంగానికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నగరి శాసన సభ్యురాలు, ప్రముఖ సినీనటి రోజా అన్నారు. పురాతనమైన చేనేత వ్యవస్ధను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించినట్లు అవుతుందని వివరించారు.

 
గురువారం విజయవాడ ఆప్కో మెగా షోరూంను సందర్శించిన ఆమె పెద్దఎత్తున చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఆప్కో ప్రదర్శనశాలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వస్త్ర శ్రేణి సంక్రాంతి వేడుకలను ముందే తీసుకువచ్చిన చందంగా ఉందన్నారు. ఆధునిక డిజైన్లతో ప్రత్యేకించి నేటి యువతకు ఉపయోగ పడే విధంగా చేనేత వస్త్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.

 
 అన్ని వాతావరణ పరిస్ధితులలోనూ చేనేత వస్త్రాలు ధరించగలుగుతామని, వాటిని ఏ రూపంలో కుట్టించుకున్నా ఇబ్బంది ఉండబోదన్నారు. చేనేత వస్త్రాలు పర్యావరణ హితంగా మన ఆకృతికి మంచి హోందాతనాన్ని ఇస్తాయని రోజా అన్నారు. చేనేత వస్త్ర శ్రేణిని నూతన రూపును తీసుకువచ్చేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేసామని ఫలితంగానే కొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకు రాగలిగామని చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి ఈ సందర్భంగా రోజాకు వివరించారు.

 
రానున్న రోజుల్లో మార్కెట్టుకు ధీటుగా నూతన వెరైటీలను తీసుకువచ్చేలా చేనేత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నమని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి ఉన్నతికి అవసరమైన అన్ని చర్యలు చేనేత, జౌళి శాఖ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆప్కో జిఎం కన్నబాబు, ముఖ్య మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments