Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ బులెటిన్ : రూ.400 తగ్గిన పసిడి తులం ధర

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (08:15 IST)
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్‌ పడిపోవడంతో ధరలు నేలచూపుచూస్తున్నాయి. 
 
దేశరాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.390 తగ్గి రూ.48 వేల దిగువకు చేరుకుంది. బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.47,910 వద్ద నిలిచింది. గడిచిన వారం రోజుల్లో బంగారం రూ.2 వేలకు పైగా తగ్గినట్లు అయింది. 
 
అదేవిధంగా హైదరాబాద్‌లో తులం పసిడి ధర రూ.760 తగ్గి రూ.49,640 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.45,500గా ఉన్నది. కిలో వెండి ఏకంగా రూ.2 వేలు తగ్గి రూ.75,500 నిలిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటంతో అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్‌ నెలకొంది. దీంతో బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments