Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి ధరలు

తగ్గిన పసిడి ధరలు.. పెరిగిన వెండి ధరలు
, శనివారం, 29 మే 2021 (10:26 IST)
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధర శనివారం కూడా దిగొచ్చింది. పసిడి రేటు పడిపోవడం ఇది వరుసగా రెండో రోజు. దీనితో పసిడి ప్రియులకి కాస్త రిలీఫ్‌గా ఉంటుందనే చెప్పాలి. కానీ వెండి ధర శనివారం పైపైకి కదిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గింది. దీంతో రేటు రూ.49,860కు క్షీణించింది.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే తగ్గడం తో రూ.45,700కు దిగి వచ్చింది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌‌లో బంగారం ధర పెరిగింది. 0.42 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1903 డాలర్లకు చేరింది.
 
ఇక వెండి అయితే రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.43 శాతం పెరుగుదలతో 28.06 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి ప్రభావం బంగారం మీద పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఫక్కీలో కారును ఆపి దంపతులపై కాల్పులు.. ఇద్దరు మృతి