Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.21 కోట్ల విలువైన 43కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (20:19 IST)
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును క్షున్నంగా పరిశీలించారు.
 
కారులోని వేరు వేరు ప్రదేశాల్లో 260 బంగారు బిస్కెట్లను కుక్కారు. వీటన్నింటికి బయటకు తీసేందుకు పోలీసులకు 18 గంటల సమయం పట్టింది. కాగా కారులోంచి బయటకు తీసిన బంగారం బరువు 43 కిలోలు ఉండగా.. దాని మార్కెట్ విలువ రూ.21 కోట్లు. గతంలో కూడా కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ కారును ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments