Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునామీలో రానున్న కరోనా థర్డ్ వేవ్ : ఎయిమ్స్ చీఫ్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (20:13 IST)
దేశంలో కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తి ఓ సునామీలా విరుచుకుపడనుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా జోస్యం చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో అనేక రాష్ట్రాలు కరోనా లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో భారత్‌లో థర్డ్‌వేవ్‌ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ ర‌ణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8 వారాల్లో కొవిడ్‌ మూడో వేవ్‌ విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
అన్‌లాక్ కార‌ణంగా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దాంతో వైరస్ రూపాంత‌రం చెందుతూ ఉంటుందని ఆయ‌న తెలిపారు. కొవిడ్ హాట్‌స్పాట్లలో తగిన నిఘా ఉంచ‌డం అవసరమన్నారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోస్‌కు, డోస్‌కు మధ్య అంతరం తగ్గించడం సవాల్‌గా మారిందన్నారు. 
 
కరోనా మొదటి, రెండో వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో గుర్తు చేసుకోవాల‌న్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్‌లాక్‌ చేయడంతో జ‌నం కనీస కొవిడ్‌ నిబంధనలు కూడా పాటించడం లేద‌ని వాపోయారు. ప‌రిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరుగ‌డం, థర్డ్ వేవ్ సునామీలా విరుచుకుపడటం ఖాయమని డాక్టర్ ర‌ణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments