Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-కామర్స్ సంస్థలకు ఊరట.. కానీ అమేజాన్‌కు తప్పని నష్టాలు

Webdunia
శనివారం, 2 మే 2020 (17:16 IST)
దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం మరో రెండు వారాల అనగా మే 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఊరట లభించింది. మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతులు లభించాయి. అయితే రెడ్ జోన్లలో మాత్రం ఈ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే డెలివరీ చేయగలవు. 
 
తాజాగా మూడో దశ లాక్ డౌన్‌కు కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే ప్రజలకు ఈ కామర్స్ సంస్థలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేయవచ్చు.  
 
ఇకపోతే.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో లాక్‌డౌన్ వల్లే తాము ఆర్థికంగా బాగా నష్టపోయామని అమేజాన్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ సీఎఫ్‌వో బ్రయాన్ ఓస్లాస్కీ వెల్లడించారు. భారత్‌లో నిత్యావసరాల డెలివరీకి మాత్రమే ఈ-కామర్స్ సంస్థలకు అనుమతులున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ త్రైమాసికంలోనే తొలిసారి అమేజాన్‌కు నష్టాలొచ్చాయని ఓస్లాస్కీ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments