Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెడ్ జోన్‌గా మారిన కాశ్మీర్ లోయ.. వలస కార్మికులకు కరోనా

రెడ్ జోన్‌గా మారిన కాశ్మీర్ లోయ.. వలస కార్మికులకు కరోనా
, శనివారం, 2 మే 2020 (11:29 IST)
కాశ్మీర్ లోయ మొత్తాన్ని రెడ్ జోన్‌గానే పరిగణిస్తామని డివిజనల్ కమిషనర్ పీకే పోలే ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గకపోవడంతో రెడ్ జోన్‌గా పరిగణిస్తున్నట్లు పీకే పోలే తెలిపారు. 
 
కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించిన జోన్ల జాబితాలో కాశ్మీర్‌లోని నాలుగు జిల్లాలు మాత్రమే రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన జిల్లాల్లో ఆంక్షలను సడలిస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల కాశ్మీర్‌లోయలోని మొత్తం పదకొండు జిల్లాలను రెడ్‌జోన్‌గా పరిగణిస్తామని పోలే పేర్కొన్నారు. 
 
మే 15 వరకు లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో కొనసాగనుంది. కేంద్రం ప్రకటించిన జాబితాలో కాశ్మీర్‌లోని బందిపోర, శ్రీనగర్‌, షోపియాన్‌, అనంతనాగ్‌లు మాత్రమే రెడ్‌ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించింది. కేవలం పుల్వామా జిల్లా మాత్రమే గ్రీన్‌జోన్‌లో ఉన్నట్లు వెల్లడించింది.
 
ఇకపోతే.. లాక్ డౌన్ ప్ర‌భావంతో దేశవ్యాప్తంగా వ‌ల‌స‌కార్మికులు ఎక్క‌‌డిక‌క్క‌డ చిక్కుకున్న విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర‌లో చిక్కుకున్న కార్మికులు ఝాన్సీ ప‌ట్ట‌ణం మీదుగా ప్ర‌భుత్వ బ‌స్సుల్లో యూపీలోని బ‌స్తీ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారికి అధికారులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఏడుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. కార్మికులంద‌రినీ ఆస్ప‌త్రికి త‌ర‌లిరంచి ఐసోలేష‌న్ వార్డులో చికిత్స‌ అందిస్తున్నట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిక్కు యాత్రికులు 173 మందికి కరోనా.. కారణం ఏమిటంటే?