Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు... త్వరలో రూ.70 వేలకు చేరే ఛాన్స్..

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (10:28 IST)
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 వేలు దాటిపోయింది. గడిచిన 10 రోజుల్లోనే 10 గ్రాముల బంగారు ధర దాదాపు రూ.5 వేలు పుంజుకుంది. మున్ముందు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతవారం భువనేశ్వర్‌లో రూ.57,620గా ఉన్న బంగారం ధర ఇపుడు రూ.61,400కు చేరింది. దీంతో ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ధర రూ.70 వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆభరణాల తయారీ కోసం వినియోగించే బంగారం ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 
 
ఈ నెల 9వ తేదీన 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర భువనేశ్వర్‌లో రూ.50,500గా ఉంది. ఇపుడు ఈ ధర రూ.55,400కు చేరుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఈ బంగారం ధరలు ఒక్క భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments