Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన ప్రభుత్వ ఉద్యోగి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (09:54 IST)
ఇటీవలికాలంలో హఠాత్తుగా గుండెపోటుకుగురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి ఘటనలు వరుసగా సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసే సురేంద్ర కుమార్ దీక్షిత్ అనే వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొని, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయనకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన స్నేహితులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన చుట్టూ ఉన్న మిగిలిన వారంతా ఆయన్ను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
భోపాల్‌లో తపాల శాఖ ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు 34వ ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్‌ను మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో నిర్వహించింది. ఆఖరి మ్యాచ్ 17వ తేదీన జరిగింది. మార్చి 16వ తేదీన కార్యాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో సురేంద్ర కుమార్ ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments