Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటి నుంచి రైల్వే స్టేషన్లలో కొత్త నిబంధనలు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (17:03 IST)
దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల మేరకు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంలపై అన్ని అమ్మకాలకు క్యాష్‌లెస్ చెల్లింపులు మాత్రమే జరపాలన్న నిర్బంధ నిబంధనను ప్రవేశపెట్టనుంది. అలాగే, ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ఈ కఠిన నింబధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి విధిగా అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 
 
రైల్వే బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్‌తో పాటు అన్ని స్టాల్స్‌లో నగదు స్వీకరించేందుకు వీలుండదు. అన్నింటినీ డిజిటల్ పద్దతిలోనే విక్రయిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం రూ.10 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ, స్వైపింగ్ మెషీన్లను షాపు యజమానులు కలిగివుండాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతి విక్రయానికి తప్పకుండా కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన కూడా విధించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments