ఆగస్టు ఒకటి నుంచి రైల్వే స్టేషన్లలో కొత్త నిబంధనలు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (17:03 IST)
దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల మేరకు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంలపై అన్ని అమ్మకాలకు క్యాష్‌లెస్ చెల్లింపులు మాత్రమే జరపాలన్న నిర్బంధ నిబంధనను ప్రవేశపెట్టనుంది. అలాగే, ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ఈ కఠిన నింబధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి విధిగా అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 
 
రైల్వే బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్‌తో పాటు అన్ని స్టాల్స్‌లో నగదు స్వీకరించేందుకు వీలుండదు. అన్నింటినీ డిజిటల్ పద్దతిలోనే విక్రయిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం రూ.10 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ, స్వైపింగ్ మెషీన్లను షాపు యజమానులు కలిగివుండాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతి విక్రయానికి తప్పకుండా కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన కూడా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments