Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయండి : సుప్రీంలో పిటిషన్

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (15:49 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే నెల 11వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను శివసేన పార్టీ విఫ్ సునీల్ ప్రభు దాఖలు చేయగా, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. 
 
సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందని, తక్షణమే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. దీంతో జూలై 11వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 
 
కాగా, శివసేన పార్టీకి చెందిన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఇపుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సొంత అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏకంగా 45 మందికిపై ఎమ్మెల్యేలను తన చెంతకు చేరుకున్నారు. వారిని ఒక శిబిరంగా చేసుకుని బీజేపీ మద్దతుతో ఆయన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments