Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు కేంద్రం శుభవార్త... రెండో దశ నగదు జమకు శ్రీకారం

Webdunia
ఆదివారం, 3 మే 2020 (18:04 IST)
దేశంలోని పేదలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి రెండో దఫా నగదు జమకు శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ సమయంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు నగదు జన్‌ధన్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా ఏప్రిల్ నెలలో తొలి దఫా నగదును డిపాజిట్ చేసింది. రెండో దశ నగదు జమను మే నెలలో శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి డ‌బ్బుల‌ను తీసుకోవ‌చ్చ‌ని సూచించింది. 
 
ఈ నెల 4వ తేదీ నుంచి 11 వ‌ర‌కు అకౌంట్ నెంబ‌ర్ల‌లోని చివరి సంఖ్య‌ల ఆధారంగా చెప్పిన రోజుల్లో బ్యాంకుకు వెళ్లి, లేదా ఏటీఎం, ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు. 11వ తేదీ త‌ర్వాత జ‌న్‌ధన్ మ‌హిళ‌ల‌ అంద‌రి అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ కానున్నాయి. 
 
జ‌మ అయిన‌ డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌ని, నిధానంగా తీసుకోవాల‌ని ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి. అయితే, బ్యాంకులకు వచ్చి తీసుకునే ఖాతాదారులు మాత్రం విధిగా సామాజిక భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని బ్యాంకులు స్పష్టం చేశాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments