పేదలకు కేంద్రం శుభవార్త... రెండో దశ నగదు జమకు శ్రీకారం

Webdunia
ఆదివారం, 3 మే 2020 (18:04 IST)
దేశంలోని పేదలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి రెండో దఫా నగదు జమకు శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. 
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం కేంద్రం లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ సమయంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు నగదు జన్‌ధన్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగా ఏప్రిల్ నెలలో తొలి దఫా నగదును డిపాజిట్ చేసింది. రెండో దశ నగదు జమను మే నెలలో శ్రీకారం చుట్టింది. ఈ నగదును సోమవారం నుంచి డ‌బ్బుల‌ను తీసుకోవ‌చ్చ‌ని సూచించింది. 
 
ఈ నెల 4వ తేదీ నుంచి 11 వ‌ర‌కు అకౌంట్ నెంబ‌ర్ల‌లోని చివరి సంఖ్య‌ల ఆధారంగా చెప్పిన రోజుల్లో బ్యాంకుకు వెళ్లి, లేదా ఏటీఎం, ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు. 11వ తేదీ త‌ర్వాత జ‌న్‌ధన్ మ‌హిళ‌ల‌ అంద‌రి అకౌంట్ల‌లో డ‌బ్బులు జ‌మ కానున్నాయి. 
 
జ‌మ అయిన‌ డ‌బ్బులు ఎక్క‌డికి పోవ‌ని, నిధానంగా తీసుకోవాల‌ని ఆయా బ్యాంకులు సూచిస్తున్నాయి. అయితే, బ్యాంకులకు వచ్చి తీసుకునే ఖాతాదారులు మాత్రం విధిగా సామాజిక భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని బ్యాంకులు స్పష్టం చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments