Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ పేమెంట్లు ఫ్రీ కాదా? ఇంకెందుకు, డబ్బు డ్రా చేసుకుని పేమెంట్స్ చేసుకోవడం బెటర్

ఐవీఆర్
శుక్రవారం, 25 జులై 2025 (19:36 IST)
రాబోయే కాలంలో డిజిటల్ పేమెంట్లు ఫ్రీగా చేసుకునే అవకాశం వుండదని అర్థమవుతోంది. ఎందుకంటే... తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ... భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్లు ఉచితంగా లభించకపోవచ్చు అని అన్నారు. ఎందుకంటే, ఆర్థికంగా యూపీఐ వ్యవస్థ స్థిరంగా సాగాలంటే ఛార్జీలు వసూలు తప్పదని ఆయన అన్నారు. ఈ ఛార్జీలను ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తోందనీ, దాంతో ఇవి క్రమంగా భారంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ స్థిరంగా వుండాలంటే అదనపు ఛార్జీలను అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఎవరో ఒకరు భరంచక తప్పదంటూ చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుంటే... డిజిటల్ పేమెంట్లు తమ బతుకులకు గుదిబండల్లా మారుతున్నాయని చిరువ్యాపారులు ఇప్పటికే పెదవి విరుస్తున్నారు. రోజువారీ తాము జరిపే అమ్మకాలు లెక్కకు వస్తున్నాయి కానీ వాటిలో తమకు మిగిలేది చాలా తక్కువ అని అంటున్నారు. ఎందుకంటే తాము కొనుగోలు చేసే సరుకుకి డిజిటల్ పేమెంట్స్ అంటే చాలామంది అంగీకరించడంలేదనీ, అందువల్ల డిజిటల్ పేమెంట్లు కంటే క్యాష్ తీసుకోవడమే బెటర్ అని వారు అంటున్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలతో ఇక మళ్లీ కరెన్సీ పేమెంట్లు తప్పని పరిస్థితి వచ్చేట్లు వుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments