Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.800, రూ.900 నాణేలను ఎపుడైనా చూశారా?

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (10:51 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.1, 2, 5, 10, 20 నాణేలు రోజువారీ చెలామణిలో ఉన్నాయి. కానీ, రూ.800, రూ.900 నాణేలను మీరు ఎక్కడా చూసివుండరు. ఎందుకంటే ఇవి దేశంలో ఎక్కడా చెలామణిలో లేవు. అయితే, ఈ నాణేలు ఎందుకు ముద్రించారన్నదే కదా మీ సందేహం. 
 
సాధారణంగా పలువురు ప్రముఖుల స్మృతి చిహ్నంగా ఆర్.బి.ఐ చాలా కొద్ది సంఖ్యలో ఇలాంటి నాణేలను ముద్రిస్తుంటుంది. ఇలా ముద్రించిన నాణేలను ప్రత్యేకంగా అమ్మకానికి పెడుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ రూ.800, రూ.900 నాణేలను తెప్పించుకున్నాడు. 
 
దేశంలో తొలిసారి విడుదలైన ఈ నాణేలను 2025, ఫిబ్రవరి 20వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న వాయిస్ తక్షణం ఆర్డర్ చేయగా, మార్చి 10వ తేదీన అందాయని వెల్లడించారు. 
 
ఈ నాణేలను జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతి సందర్భంగా ఆర్.బి.ఐ ముంబై మింట్ ముద్రించింది. వెండితో తయారు చేసిన ఈ నాణేలు ఒక్కోటి 40 గ్రాముల బరువును కలిగివుంది. కాగా, కరెన్సీ సేకరించే హాబీ ఉన్న మహ్మద్ వాయిస్ వద్ద 170 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments