Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీబీకి అమూల్ గొప్ప నివాళి.. అమూల్ బేబీతో బాలు పాట

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (12:52 IST)
పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ సంస్థ గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (74)కు గొప్ప నివాళి అర్పించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి అమూల్ బేబీ పాట పాడుతున్నట్లుగా ఉన్న ఓ బ్లాక్ అండ్ వైట్ డూడుల్‌ను అమూల్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఎస్పీబీ పాపులర్ పాటల్లో ఒకటైన 'తేరే మేరే బీచ్ మే కైసా తా యే బంధన్ అంజనా...' అన్న చరణాలను ఆ డూడుల్‌పై రాసింది.
 
సందర్భానుసారం సరైన కొటేషన్‌తో అమూల్ చేసిన ఈ పోస్టు చాలామందిని ఆకట్టుకుంటోంది. బాలుకు ఇది గొప్ప నివాళి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ డూడుల్ వైరల్‌గా మారింది. 'తేరే మేరే బీచ్ మే' పాటను 1981లో కమల్ హాసన్ హిందీ చిత్రం ఏక్ దూజే కె లియే కోసం బాల సుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ కలిసి పాడారు.
 
కాగా, గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం(74) కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఒంటిగంటకు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments