Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకానికి ఎయిరిండియా.. బీపీసీ కూడా... నిర్మలా సీతారామన్ వెల్లడి

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (14:03 IST)
అప్పుల్లో కూరుకుని పోయిన ప్రభుత్వ రంగ వైమానిక సంస్థ ఎయిరిండియాతో పాటు.. భారత్ పెట్రోల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లను విక్రయించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలను వచ్చే సంవత్సరం మార్చిలోగా విక్రయిస్తామన్నారు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం రూ.58 వేల కోట్ల అప్పుల్లో ఉందని ఆమె తెలిపారు. 'రెండు కంపెనీల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి చేయాలని భావిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అనుసరించి తుది నిర్ణయం ఉంటుంది' అని తెలిపారు. 
 
కాగా, ఈ నెలారంభంలో ఎయిర్ ఇండియా ఉద్యోగులకు బహిరంగ లేఖను రాసిన సంస్థ చైర్మన్ అశ్వని లోహానీ, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ తర్వాత సంస్థ నిలదొక్కుకుంటుందన్న భరోసాను ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్, ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపుతున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments