శీతాకాలంలో మృదువైన చర్మం కోసం...

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (21:54 IST)
ముఖం అందంగా ఉండాలని రకరకాల క్రీంలు వాడుతుంటారు. అవి వాడటం వల్ల చర్మం పాడైపోతుంది. అలాకాకుండా ఎంతో సులభంగా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కొన్ని చిట్కాలతో మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. మృదువైన చర్మం కోసం అరచెక్క నిమ్మరసాన్ని ఒక గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి ఒకటి రెండుసార్లు చేయాలి.
 
2. ప్రతి రోజు కీరదోసకాయ ఫేస్ మాస్క్ వేసుకుంటే మెుటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు, పొడిచర్మం వంటి సమస్యలు మీ దరిచేరవు. అదెలాగంటే... రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ సగం ముక్క కీరదోసకాయ గుజ్జు, కొంచెం పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
 
3. కీరదోసకాయను క్లెన్సర్‌గా కూడా వాడవచ్చు. కీరదోసకాయ రసంలో కొన్ని పాలు కలిపితే క్లెన్సర్ అవుతుంది.
 
4. తేనెని గోరువెచ్చగా వేడిచేసి కళ్ల చుట్టూ వదిలి ముఖానికి రాస్తే ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మీద మచ్చలు, ముడతలు పోతాయి.
 
5. చర్మం పొడిగా ఉన్నవారు అర టీ స్పూన్ రోజ్ వాటర్‌లో ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
 
6. బొప్పాయి రసాన్ని క్రమంతప్పకుండా ముఖానికి రాసుకుంటుంటే సూర్యకాంతి వల్ల చర్మంపై ఏర్పడ్డ గోధుమరంగు మచ్చలు తగ్గిపోతాయి. చర్మం మెరిసి పోవాలంటే బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి వాడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమ పెళ్లైన ఎనిమిది నెలలకే నర్సును హత్య చేసిన భర్త.. గోనె సంచిలో కుక్కి..

2027 గోదావరి పుష్కరాలు.. మహా కుంభమేళా తరహాలో ప్రయాగ్ మోడల్

ఏపీలో ఒకవైపు ఎండలు.. వడగాలులు.. మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలు

Iran War Live Updates: ఇజ్రాయేల్ దాడులు ఇరాన్‌లో 18మంది మృతి

Heat Wave Alert: ఏప్రిల్ 10కి తర్వాత తెలంగాణలో వడగాలులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

తర్వాతి కథనం
Show comments