Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో నడక ఎంతో ముఖ్యం... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:41 IST)
సాధారణంగా మనం ఉదయం లేవగానే ఉరుకులు పరుగుల జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. దీని ప్రభావం మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై పడుతుంది. దీనివలన రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద‌యాన్నే 30 నిమిషాల న‌డ‌క మీ జీవ‌న గ‌తినే మార్చుతుంది. ముఖ్యంగా డ‌యాబెటిస్‌, ఒబేసిటీ, గుండె రుగ్మ‌త‌లు లాంటి్వి ఉంటే ఉద‌య‌పు న‌డ‌క‌తో వీటి తీవ్ర‌త త‌గ్గుతుంది. కండ‌రాల‌కు, గుండెకు చాలా మంచిది. ఉద‌య‌పు చ‌లిగాలులు న‌రాల‌కు మంచిది. 30 నిమిషాల ఉద‌య‌పు న‌డ‌క 2 గంట‌ల జిమ్‌తో స‌మానం. ఉద‌యం న‌డిస్తేనే మంచిది ఎందుకంటే...
 
1. ఉద‌యాన్నే గాలిలో క‌లుషిత‌పు ఛాయ‌లు త‌క్కువ‌గా ఉంటాయి. తాజా గాలిలో ప్రాణ‌వాయువు పుష్క‌లంగా ఉంటుంది. ప్రాణ‌వాయువు శ‌రీరంలోని క‌ణాల‌కు బాగా అందుతుంది త‌ద్వారా అన్ని ప‌నులు సునాయాసంగా జరిగిపోతాయి. శ‌రీరం బాగా ప‌నిచేసిన‌ప్పుడు ఎలాంటి రోగాలు అంత తొంద‌ర‌గా ద‌రిచేర‌వు.
 
2. శ‌రీరంలో కొవ్వును క‌రిగించ‌డంలో ఇది స‌హ‌క‌రిస్తుంది. న‌డ‌క మంచిదే. బ్రిస్క్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల గుండె వ్యాధులు త‌గ్గుతాయి. ఉద‌యాన్నే 30 నిమిషాలపాటు న‌డ‌వ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. ప్ర‌తి రోజు ఉదయాన్నేన‌డ‌క‌ను అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల బీపీ అదుపులో ఉంటుంది.
 
3. చాలా ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఒబేసిటీ కార‌ణం. రోజులో ఎక్కువ స‌మ‌యం క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం వ‌ల్ల ఒబేసిటీ వ‌స్తుంది. బ‌రువు త‌గ్గాల‌నుకుంటే ఉదయపు నడక చాలా మేలు చేస్తుంది. ఇది బ‌రువు త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.
 
4. అర్థ‌రైటిస్‌ను నివారిస్తుంది. అంత‌గా క‌ద‌లిక లేని జీవితాన్ని గ‌డ‌ప‌డం వ‌ల్ల మోకాలి కండ‌రాలపై ప్ర‌భావం చూపిస్తుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో ఎముక‌ల దృఢ‌త్వం త‌గ్గుతుంది. నిదానంగా న‌డ‌వ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గి ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. 
 
5. శ‌రీరం ఆరోగ్యంగా ఉండేందుకు కొంచెం కొల‌స్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ర‌క్తంలో కొలెస్ట్రాల్ నిల్వ‌లు తగ్గితే శ‌రీర బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.  
 
6. జ్ఞాపక శక్తి పెరగడం, మెద‌డు చురుగ్గా పనిచేయడం లాంటివి ఉదయంపూట నడవటం వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఉదయం పూట నడవటం వ‌ల్ల శ‌రీరం పున‌రేత్త‌జిమ‌వుతుంది. న‌డిచిన‌ప్పుడు ఆక్సిజ‌న్ బాగా అంది ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగ‌వుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

తర్వాతి కథనం
Show comments