ముడతల చర్మానికి చందనం రాసుకుంటే?

ఈ కాలంలో మహిళల చర్మం నల్లగా మారడం సహజమే. అదేవిధంగా మెుటిమలు కూడా సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యలు. వీటిని అదుపులో ఉంచాలంటే చందనం వాడితే మంచి ఫలితాలను పొందవచ్చును. చందనంలో కాస్త గులాబీనీరు కలిపి ముఖానికి

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (13:46 IST)
ఈ కాలంలో మహిళల చర్మం నల్లగా మారడం సహజమే. అదేవిధంగా మెుటిమలు కూడా సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్యలు. వీటిని అదుపులో ఉంచాలంటే చందనం వాడితే మంచి ఫలితాలను పొందవచ్చును. చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి ముఖానికి పూతలా వేసుకుని 10 నిమిషాల తరువాత కడుక్కుంటే ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
 
చందనం ముఖంపై ఉండే ముడతలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది. రెండు చెంచాల పెరుగులో కాస్త చందనం పొడి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరాక కడిగేసుకుంటే జిడ్డు చర్మం కాస్త మృదువుగా మారుతుంది. రెండు చెంచాల ముల్తానీమట్టిలో కొద్దిగా అరటిపండు గుజ్జు, మూడు చంచాల చందనం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత కడిగేస్తే నలుపుదనం దగ్గడమే కాకుండా మెుటిమల సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. చందనంతో పూత వేసుకునే ముందుగా ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ

తెలంగాణ టూరిజంకు రూ.146.50 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి

SIR begins in Telangana: తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం సన్నాహక పనులు ప్రారంభం

MBBS Student: హాస్టల్ గదిలో మృతి చెందిన ఎంబీబీస్ స్టూడెంట్.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్

ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్: జపాన్ అనాన్‌పై సోలోగా రెబల్ స్టార్

మన శంకర వర ప్రసాద్ గారు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

తర్వాతి కథనం
Show comments