ఉల్లిరసం, పెరుగు, లావెండర్ ఆయిల్.. ఈ మూడింటిని?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:53 IST)
ఉల్లిరసంలో శెనగపిండి, మీగడ చేర్చి ముఖానికి రాసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది. ఉల్లిరసంతో కూడిన ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు చేస్తే పిగ్మెంటేషన్ తగ్గి చర్మం మెరిసిపోతుంది. చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లి రసాన్ని నేరుగా ముఖం మీద పూసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్‌, విటమిన్లు చర్మానికి సరిపడా పోషణను అందిస్తాయి. 
 
అలాగే ఉల్లి రసంలో కాటన్‌ను ముంచి రోజూ ఉదయం పూట ముఖ చర్మానికి రాసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుంది. ఇలా చేస్తే వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. ఉల్లిరసంలోని విటమిన్ సి.. చర్మంపై వున్న మచ్చలను తొలగిస్తుంది. 
 
ఒక టేబుల్ స్పూన్ ఉల్లిరసానికి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, నాలుగైదు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు స్పూన్ల ఉల్లి రసం చేర్చి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం తళతళ మెరిసిపోతుంది. రోజూ పసుపు, ఉల్లిరసాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయని బ్యూటీషియన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ పని ముగించి క్యూబా సంగతి చూస్తా: డొనాల్డ్ ట్రంప్

వైకాపా విధ్వంసంతో నవ్యాంధ్ర 30 యేళ్లు వెనక్కి వెళ్లింది : పవన్ కళ్యాణ్

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

తల్లి బంగారన్ని తెగనమ్మి ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడికి బైక్ కొనిచ్చిన ప్రియురాలు

పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక అవకతవకలు.. బాబుకు ఉండవల్లి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

తర్వాతి కథనం
Show comments