పెరుగులో గుడ్డు తెల్లసొనను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాల

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:05 IST)
కొందమంది ముఖంపై మెుటిమలు చాలా ఉంటాయి. మరికొందమంది ఆ మెుటిమలే మచ్చలుగా మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యల వలన వాళ్లు బయట దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాంటి క్రీములతో పనిలేకుండా ఇంట్లో పాటించే చిట్కాలతో మెుటిమలను తొలగించుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
పెరుగులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమల తాలూకు మచ్చలు తొలిగిపోతాయి. కోడిగుడ్డులోని తెల్లసొనని వేరుచేసుకుని గిలక్కొట్టి మృదువుగా చేసుకోవాలి. ఆ తెల్లసొనలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.  
 
తద్వారా మెుటిమలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఓట్‌మీల్‌ను పొడి చేసుకుని ఆ పొడిలో పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

తర్వాతి కథనం
Show comments