Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గుజ్జులో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చాలామందికి చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెసరపిండిలో కొద్దిగా తేనె, పచ్చిపాలను కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:06 IST)
చాలామందికి చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెసరపిండిలో కొద్దిగా తేనె, పచ్చిపాలను కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.
 
బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. బంతిపువ్వుల రేకులను ఎండబెట్టుకుని వాటిని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 
 
కీరదోసను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే ఈ శీతాకాలంలో మంచిది. ప్రతిరోజూ నాలుగైదు లీటర్ల నీళ్లను తీసుకుంటే చర్మం సహజసిద్ధంగా ఉంటుంది. రాత్రి సమయంలో శరీరానికి నూనె రాసుకుని ఉదయాన్నే స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments