Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతి పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి...?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:42 IST)
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత గోరువెచ్చని నీటిలో క్లీంజర్ లేదా ఏదైనా ప్యూరిఫైయింగ్ జెల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని కడుక్కోవాలి. ఎప్పుడు కూడా మీరు సబ్బును వాడకండి. ఎందుకంటే సబ్బు వలన మీ ముఖంలోనున్న సహజసిద్ధమైన ఆయిల్‌ను పీల్చేస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంది. 
 
ముఖాన్ని కడిగిన తరువాత ఎల్లప్పుడు ఓ మెత్తని తువాలుతో తుడవాలి. ముఖాన్ని ఎక్కువగా రుద్దకండి.. అలా చేస్తే చర్మంలో పగుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ తర్వాత టోనింగ్ చేయండి. టోనింగ్‌తో మీ చర్మంలో దాగివున్న మురికి, మిగిలివున్న మేకప్ బయటకు వచ్చేస్తుంది. టోనర్‌తో మీ ముఖ చర్మం సాధారణ స్థితికి వస్తుంది. దీంతో ముఖవర్చస్సు పెరుగుతుంది.
 
ఆ తరువాత చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అది మీ చర్మానికి తగ్గట్టుండాలి. చర్మంపై మాయిశ్చరైజర్ చేయడం వలన మీ చర్మం సుతి మెత్తగాను, నునుపుగాను తయారవుతుంది. దీంతోపాటు చర్మంలోని సూక్ష్మరంద్రాలు.. పొడిబారడం నుండి కాపాబడుతాయి. మాయిశ్చరైజర్ చేసిన తరువాత సన్‌స్క్రీన్ వాడొచ్చు. అలానే పావుకప్పు మెంతి పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి రాసుకుంటే కూడా మంచిది. ఇలా చేయడం వలన ముఖం చర్మం తాజాగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

భారత్ దెబ్బకు వణికిపోతున్న పాకిస్థాన్ - రక్షణ వ్యయం 18 శాతానికి పెంపు

భారత తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాం : పాకిస్థాన్

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ను నడిపింది ఇద్దరు మహిళలే.. తాట తీస్తాం? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

తర్వాతి కథనం
Show comments