Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతి పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి...?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:42 IST)
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత గోరువెచ్చని నీటిలో క్లీంజర్ లేదా ఏదైనా ప్యూరిఫైయింగ్ జెల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని కడుక్కోవాలి. ఎప్పుడు కూడా మీరు సబ్బును వాడకండి. ఎందుకంటే సబ్బు వలన మీ ముఖంలోనున్న సహజసిద్ధమైన ఆయిల్‌ను పీల్చేస్తుంది. దీంతో చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంది. 
 
ముఖాన్ని కడిగిన తరువాత ఎల్లప్పుడు ఓ మెత్తని తువాలుతో తుడవాలి. ముఖాన్ని ఎక్కువగా రుద్దకండి.. అలా చేస్తే చర్మంలో పగుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ తర్వాత టోనింగ్ చేయండి. టోనింగ్‌తో మీ చర్మంలో దాగివున్న మురికి, మిగిలివున్న మేకప్ బయటకు వచ్చేస్తుంది. టోనర్‌తో మీ ముఖ చర్మం సాధారణ స్థితికి వస్తుంది. దీంతో ముఖవర్చస్సు పెరుగుతుంది.
 
ఆ తరువాత చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అది మీ చర్మానికి తగ్గట్టుండాలి. చర్మంపై మాయిశ్చరైజర్ చేయడం వలన మీ చర్మం సుతి మెత్తగాను, నునుపుగాను తయారవుతుంది. దీంతోపాటు చర్మంలోని సూక్ష్మరంద్రాలు.. పొడిబారడం నుండి కాపాబడుతాయి. మాయిశ్చరైజర్ చేసిన తరువాత సన్‌స్క్రీన్ వాడొచ్చు. అలానే పావుకప్పు మెంతి పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి రాసుకుంటే కూడా మంచిది. ఇలా చేయడం వలన ముఖం చర్మం తాజాగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments