సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా..?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:14 IST)
కొత్తిమీర, కరివేపాకులు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలా కనుక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పు జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే.. మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిల్వవుంటాయి. అల్లం. పచ్చిమిర్చి కూడా అలానే మెత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి ఉప్పు వేసి నిల్వచేసుకోవచ్చు.
 
1. ఖాళీ అయిన నెయ్యి లేదా నూనె ప్యాకెట్లలో పప్పులు నిలువ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ధనియాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని బాణలిలో కాసేపు వేడిచేసి ఆపై డబ్బాలో నిల్వచేస్తే చాలాకాలం వరకు నిల్వ ఉంటాయి. 
 
2. పప్పులు, ఉప్పులు వేసుకునే సీసాలు మురికిగా ఉన్నట్లైతే.. బంగాళాదుంప తొక్కల్ని వాటిలో వేసి కాసిన్ని నీళ్లుపోసి బాగా కలిపి ఆ తర్వాత నీటితో కడిగితే జిడ్డంతా తొలగిపోతుంది. అలానే కర్పూరం త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే.. కర్పూరం డబ్బాలో అడుగుభాగాన కొన్ని బియ్యపు గింజలను వేస్తే కరగకుండా ఉంటాయి. 
 
3. సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా.. సగం తరిగిన బంగాళదుంప ముక్కను సూప్‌లో వేయండి. 15 నిమిషాల తరువాత తక్కువ మంటమీద సూప్‌ను వేడిచేస్తే ఉప్పును పీల్చేస్తుంది. ఆపై బంగాళదుంపను తీసేయొచ్చు.
 
4. పుదీనా, మిరియాలపొడి వంటి వాటిని సూప్‌‍లలో ఎక్కువగా చేర్చండి. అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది. మంచి రుచితోపాటు బలవర్థకం కూడా. సూప్‌లు చిక్కగా రావాలంటే.. మీకు నచ్చిన కూరగాయల్ని ఉడికించి తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని సూప్‌లో కలిపితే చాలా బాగుంటుంది.
 
5. ఎక్కువ రోజుల నుండి వాడుతున్న వంటసోడా సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఇలా చేయండి.. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి అందులో కొద్దిగా వంటసోడా వేయండి. నీటిలో వెంటనే బుడగలు వస్తే అది చక్కగా పనికొస్తుందని అర్థం.
 
6. ఆకుకూరలు, కూరగాయలను కడిగేటప్పుడు నీళ్ళల్లో చిటికెడు వంటసోడా చేరిస్తే.. వండిన తర్వాత ఆకుకూరలు రంగు మారకుండా ఉంటాయి. అంతేకాదు కుళాయి నుండి పట్టిన నీళ్లలో సూక్ష్మక్రిములు ఉంటే కూడా తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వారణాసి గంగా ఘాట్‌లో మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన, గంగలో దూకేశాడు, వీడియో

భార్య నుంచి విడాకులు వచ్చినందుకు గుడికి 9 కి.మీ వెళ్తూ భర్త పొర్లుదండాలు, వీడియో

రెండో పెళ్ళి చేసుకుని భర్త వేధింపులు... ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకున్న భార్య

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ - ఏప్రిల్ 14న అందుబాటులోకి...

బందరులో ఓ బఫూన్ ఉన్నాడు : మంత్రి కొల్లు రవీంద్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

Dr. Rajasekhar: నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు : హీరో రాజశేఖర్

పళ్లిచట్టంబి మా డ్రీమ్ ప్రాజెక్ట్,మనందరి సినిమా కాబోతోంది - టొవినో థామస్

Vaishnavi: 2 మిలియన్లను దాటిన ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ లోని తొలి గీతం సంచారమే.

తర్వాతి కథనం
Show comments