Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిమిర్చి, టమోటాలు ఉడికించి ఇలా చేస్తే..?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:54 IST)
కారంతో కళ్లలోనూ, ముక్కులోనూ నీళ్లు తెప్పించే ఒకే ఒక్కటి మిరపకాయ. మిరపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మిరపకాయల్నింటిలో కారం ఇచ్చే రసాయనం కాప్సైసిన్ అనే ఆల్కలాయిడ్. ఈ రసాయనానికి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు మిరపలో కారంతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. 
 
4 పచ్చిమిర్చీలను ఓ చిన్న గిన్నెలో వేసి అందులో కొద్దిగా నీరు, 3 చిన్న టమోటాలు వేసి నీరు ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తరువాత వీటిని కొద్దిగా ఉప్పు, చింతపండు, చిన్న ఉల్లిపాయ చేర్చి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో కలిపి తీసుకుంటే ఆ రుచి గురించి అస్సలు చెప్పలేం. ఈ వంటకాలు నోరు చేదుగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది. 
 
కండరాలు తీవ్రంగా నొప్పి పెడుతున్నప్పుడు ఆ బాధ నుండి ఉపశమనం పొందాలంటే.. ఆ ప్రదేశంలో పట్టీలను అతికిస్తారు. ఆ పట్టీలలో రాసే రసాయనం మిరపలోని కాస్పైస్ అనే ఆల్కలాయిడే. కనుక మిరప రుచికి గరంగరంగా ఉన్నప్పటికీ దివ్యౌషధంగా కూడా సహాయపడతుంది.
 
పచ్చి మిరపకాయలు బాగా తినేవారిలో కొన్ని రకాల వ్యాధులు.. ముఖ్యంగా గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. పచ్చిమిర్చిలోని రసాయనాలు రక్తనాళాలకుండే సాగిపోయే గుణాన్ని రానీయకుండా కాపాడుతాయి. రక్తనాళాలు బిగుసుపోవడం వలన వచ్చే వ్యాధులు పచ్చిమిరపకాయలు తినేవారికి దరిచేరవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments