Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి పాలలో తేనె కలిపి.. ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:01 IST)
ఎండ వలన నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జుట్టు పొడిబారి ఎండు గడ్డిలా కనిపిస్తున్నప్పుడు.. కప్పు కొబ్బరి పాలలో నాలుగు చెంచాల తేనె, ఒకటి లేదా రెండు కోడిగుడ్ల తెల్ల సొన చేర్చి బాగా కలిపి తలంతా పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.
 
అప్పటికప్పుడు చర్మానికి మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చేసి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే ఫలితం ఉంటుంది. శరీరం కోమలంగా తయారై.. ప్రకాశవంతంగా కనిపించాలంటే.. స్నానానికి అరగంట ముందు.. కొబ్బరిపాలతో బాగా మర్దన చేసుకుని సోయాపిండిలో కొద్దిగా బత్తాయిరసం కలిపి నలుగులా పెట్టుకోవాలి. 
 
బయటినుంచి వచ్చాక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వలన నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరినీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది. కొబ్బరి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. ముఖంపై గల నల్లటి మచ్చలు, మొటిమలు పోతాయి. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments