Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు, కలబంద గుజ్జుతో చర్మం మృదువుగా.. ఎలా?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (13:30 IST)
ముఖంపై మెుటిమలు తొలగించుకోవడానికి రకరకాల క్రీములు, మందులు వాడుతుంటారు. మరి వాటిని వాడితో కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఈ క్రీములు వాడడానికి బదులుగా ఇంట్లోని పదార్థాలు ఉపయోగించే మెుటిమలు నుండి ఉపశమనం లభిస్తుంది. అవేంటో పరిశీలిద్దాం..
 
వంటసోడా ఎప్పుడు ఇంట్లో ఉండేదే కాబట్టి.. వంటసోడాతో ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం.. వంటసోడాలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారాంలో రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
ఈ మెుటిమల కారణంగా ముఖంపై నల్లని నల్లని మచ్చలు వస్తుంటాయి. వాటిని ఎలా తొలగించాలంటే.. క్యారెట్‌‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. 
 
కొందరికి వయసు తేడా లేకుండా ముఖం ముడతలుగా మారిపోతుంది. అలాంటప్పుడు.. పాలలో కొద్దిగా కలబంద గుజ్జు, కాకరకాయ రసం, పెరుగు వేసి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ముడతల చర్మం తొలగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments