Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ పిండి, నిమ్మచెక్కతో ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (11:16 IST)
జిడ్డు చర్మాన్ని ఎలా తొలగించాలని ఆలోచిస్తున్నారా.. ఇలా చేయండి మంచి ఉపశమనం లభిస్తుంది. శెనగపిండిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మాన్ని తాజాగా మార్చుతాయి. మరి దీనితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం...
 
1. శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కోమలంగా మారుతుంది. 
 
2. గోధుమ పిండిలో కొన్ని నిమ్మ చెక్కలు వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని గంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం మృదువుగా మారుతుంది. 
 
3. పాలను మరిగించినప్పుడు దాని నుండి వచ్చే మీగడను పారేస్తుంటారు. మీగడలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. పారేయాలనిపించదు. అవేంటో చూద్దాం.. మీగడ పొడిబారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. 
 
4. మీగడలో కొద్దిగా పెరుగు, కీరదోస మిశ్రమం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖచర్మం తాజాగా మెరుస్తుంది. 
 
5. గోధుమ పిండిలో కొన్ని మెంతులు వేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంలో చిటికెడు పసుపు కొద్దిగా కలబంద గుజ్జు వేసి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments