పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు కలిపి..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:31 IST)
నిత్యం అందుబాటులో ఉండే పెసరపిండితో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పెసరపప్పులోని గుణాలు చర్మ ఛాయను పెంచేందుకు ఎంతో దోహదపడుతాయి. కొద్దిగా పెసరపిండిలో చిటికెడు పసుపు, పాలు వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఇప్పుడు ముఖానికి ఆలివ్ నూనె లేదా నువ్వుల నూనె రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా చేసి పెట్టుకున్న పెసర పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మెరిసిపోతుంది. 
 
3 స్పూన్స పెసరిపిండిలో 2 స్పూన్ల పెరుగు, కీరదోస రసం, కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే 3 స్పూన్ల పెసరపిండిలో కొద్దిగా ఆపిల్ గుజ్జు, స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి.
 
ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ ఉదయాన్నే చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో మెరుపులు, బలమైన గాలులు.. గాలిలో ఎగిరిన వ్యక్తి.. 89 మంది మృతి (video)

Woman: ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర-20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యం.. నారా లోకేష్

NEET UG-2026: నీట్‌ను రద్దు చేయాలి... తమిళనాడు సీఎం విజయ్

భార్యపై అనుమానం.. గొడ్డలితో భార్య కాలిని నరికిన భర్త...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments