Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ టీపై అంతర్జాతీయ కుట్ర: అసోంలో ప్రధాని మోదీ ఆగ్రహం - ప్రెస్ రివ్యూ

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:31 IST)
భారతీయ ‘టీ’ని అపఖ్యాతిపాలు చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతున్నదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని, కుట్రదారులపై పోరులో తేయాకు కార్మికులు తప్పక విజయం సాధిస్తారని చెప్పారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

 
ఆ కథనం ప్రకారం.. త్వరలో ఎన్నికలు జరుగనున్న అసోంలో మోదీ ఆదివారం పర్యటించారు. పక్షం రోజుల వ్యవధిలో ఆయన అసోం రావడం ఇది రెండోసారి. రాష్ట్ర హైవేల అభివృద్ధి పథకం ‘అసోం మాల’ను ప్రారంభించడంతో పాటు రెండు వైద్య కళాశాలలకు మోదీ శంకుస్థాపన చేశారు.

 
తేయాకు తోటల సాగులో అసోంది ప్రముఖ స్థానం. ఈ నేపథ్యంలో భారతీయ టీపై కుట్ర విషయాన్ని మోదీ ప్రస్తావించారు. దేశం వెలుపల ఈ కుట్ర జరుగుతున్నదంటూ పరోక్షంగా ఎన్జీవో ‘గ్రీన్‌పీస్‌' నివేదికను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 
భారత్‌లోని తేయాకు తోటల్లో ఎరువులను అధికంగా వినియోగిస్తున్నారని ఆ సంస్థ తన నివేదికలో ఆరోపించింది. ఇటువంటి దాడిని భారత తేయాకు తోటల కార్మికులు సహించరని మోదీ మండిపడ్డారు.

 
ప్రతి రాష్ట్రంలో మాతృభాషలో బోధించే కనీసం ఒక వైద్య కళాశాల, రెండు సాంకేతిక కళాశాలలు ఉండాలని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments