Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైయినర్‌ను పంజాలతో కొట్టి ఆడుకుంటూ చంపేసిన సర్కస్ పులులు

Webdunia
శనివారం, 6 జులై 2019 (15:11 IST)
నాలుగు పులులు వాటి ట్రైనర్‌ను తీవ్రంగా గాయపరచడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఇటలీలోని ఓ సర్కస్ కంపెనీలో పులులకు శిక్షణ ఇచ్చే ఎటోర్ వెబర్(61) ఇటీవల ఆ పులులతో రిహార్సల్స్ చేయిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పులులు ఉన్న బోనులోకి వెళ్లిన వెబర్ వాటితో రిహార్సల్స్ చేయిస్తుండగా ఒక పులి ఆయనపై దూకి తీవ్రంగా గాయపరిచింది. మిగతా మూడు కూడా దానికి తోడయ్యాయి.
 
నాలుగు పులులూ కలిసి వెబర్‌ను పంజాలతో కొడుతూ బోనులో అటూఇటూ విసురుతూ ఆయన శరీరంతో ఆడుకున్నాయి. సర్కస్‌ కంపెనీలో పనిచేసే మిగతా సిబ్బంది, వైద్య సిబ్బంది వచ్చి రక్షించేటప్పటికే తీవ్రంగా గాయపడిన వెబర్ అనంతరం ప్రాణాలు కోల్పోయారు. ఓర్ఫీ సర్కస్‌లో పనిచేసే వెబర్‌కు ఇటలీలోని అత్యుత్తమ సర్కస్ శిక్షకుల్లో ఒకరిగా పేరుంది. యానిమల్ పార్క్ అనే షో కోసం ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆయన వాటికి శిక్షణ ఇస్తున్నారు.
 
కాగా, ఈ ఘటన తరువాత ఆ నాలుగు పులులను సర్కస్ కంపెనీ నుంచి జూకి తరలించారు. ఐరోపాలోని 20 దేశాలు సహా ప్రపంచంలోని సుమారు 40 దేశాల్లో సర్కస్‌లలో అడవి జంతులతో విన్యాసాలు చేయించడం, ప్రదర్శించడంపై నిషేధం ఉంది. కానీ, ఇటలీలో అలాంటి నిషేధం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments