Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల్లో వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే పెరుగు..

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (10:48 IST)
ఒత్తిడిగా వున్నట్లు అనిపించినప్పుడు కాస్త పెరుగు తీసుకుంటే చాలు.. మెదడు తేలికగా మారుతుంది. ఇంకా క్రమం తప్పకుండా పెరుగును తీసుకుంటే ఒబిసిటీ దరి చేరదు. బరువు నియంత్రణలో వుంటుంది. పెరుగు తీసుకునేవారిలో  గుండె సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. పెరుగు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే అందుకు కారణం. అధికరక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది.
 
అంతేగాకుండా శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో వుంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని వైద్యులు చెప్తున్నారు. దీనిలో క్యాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, పళ్లు దృఢంగా ఉండేలా చేస్తుంది.
 
భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపోరోసిస్‌ లాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి.  దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపులో ఇన్‌ఫెక్షన్లు కూడా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments