Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేపాకులను నీటిలో మరిగించి తీసుకుంటే?

శరీర రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వేప ఆకులలో పుష్కలంగా ఉన్నాయి. ఈ వేపాకులను టీలో వేసి మరిగించి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేపాకులో యాంటీ వైరల్, యాం

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (10:05 IST)
శరీర రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వేప ఆకులలో పుష్కలంగా ఉన్నాయి. ఈ వేపాకులను టీలో వేసి మరిగించి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేపాకులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. విష జ్వరాలను నుండి విముక్తి కలిగిస్తుంది.
 
వేపాకులను కడిగి వాటిని ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని పొడిచేసి ప్రతిరోజూ తేనెలో కలుపుకుని తీసుకుంటే శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలుపుకుని తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ వేపాకులను పేస్ట్‌లా చేసుకుని కీళ్ల నొప్పులకు రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
వేపాకులను నీటిలో మరిగించి చల్లారిన తరువాత తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా నోట్లోని క్రిములు నశిస్తాయి. దంతాలు దృఢంగా ఉంటాయి. అగే నీటితో కళ్లను కడుక్కుంటే కంటి దురదలు తగ్గుతాయి. కళ్ల కలక వచ్చిన వారు ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. వేపాకులను నూరి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి.
 
కాసేపటి తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. అలానే ఆ పేస్ట్‌ను గాయాలకు, దెబ్బలకు, పుండ్లపై రాసుకుంటే త్వరగా తగ్గుముఖం పడుతాయి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు, దురద సమస్యలు ఉండవు. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments