Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పగలు రాత్రి... ఏసీ గదుల్లో ఉంటున్నారా...

చాలామంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏసీ గుదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా సరే. అదేపనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ

పగలు రాత్రి... ఏసీ గదుల్లో ఉంటున్నారా...
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (15:53 IST)
చాలామంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏసీ గుదుల్లోనే ఉంటుంటారు. అది వేసవి కాలమైనా.. శీతాకాలమైనా సరే. అదేపనిగా ఏసీలో ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యలేంటో ఇపుడు తెలుసుకుందాం.
 
* నిరంతరం ఏసీ గదుల్లో ఉండటం వల్ల సహజంగానే కళ్లు పొడిబారతాయి. కళ్లలో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్లు పొడిబారిపోయి దురద, మంటపెడతాయి. 
* గంటల కొద్దీ ఏసీలో ఉండేవారికి చర్మ పొడిబారిపోయి దురదపెడుతుంది. ఏసీ కింద ఉండి ఎండలోకి వెళితే చర్మం మరింతగా పొడిబారుతుంది. దీంతో చర్మ దురద సమస్య మరింతగా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 
* ఏసీ వల్ల గదిలో ఉండే తేమ శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. నీళ్లు బాగా తాగాలనిపిస్తుంది.
* పొద్దస్తమానం ఏసీలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ముక్కు, గొంతు, కళ్లు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి. 
* గొంతు పొడిబారిపోతుంది. ముక్కు రంధ్రాలు పూడుకుపోతాయి. 
* ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు. లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది.
* ఏసీల్లో ఉండే వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది మైగ్రేన్‌కు కూడా దారితీయొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోదావరిలో నిత్య అన్నపూర్ణి.. ఆమే డొక్కా సీతమ్మ..!