ముందుగా బ్రెడ్ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెనం మీద కాల్చుకోవాలి. ఆ తరువాత ఒక బాణలిలో నూనె పోసి వేడయ్యాక దాల్చిన చెక్క, సోంపు వేసి వేయించి తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు పాటు బాగా వేయించి టమోటాలు, ఉప్పు, చక్కెర కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
ఆ తరువాత క్యాప్సికమ్, క్యారెట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు వేసి అర గ్లాసు నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలిపి చిన్నమంట మీద మరో 2 నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి బ్రెడ్ బిర్యానీ రెడీ.