Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేతన జీవులకు నిరాశ : ఆదాయపన్ను జోలికి వెళ్లని కేంద్రం

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (12:51 IST)
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనివ్వలేదు. కోట్లాది మంది ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూసే ఆదాయపన్ను శ్లాబు మార్పులు చేయలేదు. గత ఏడేళ్లుగా వీటి జోలికెళ్లని కేంద్రం.. ఈ దఫా కూడా ఉద్యోగులపై కనికరం చూపలేదు. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐటీ శ్లాబుల ప్రకారమే ఆదాయ పన్నును సమర్పించుకోవాల్సివుంది. 
 
అయితే, 2022 జనవరి నెలలో రికార్డు స్థాయిలో రూ.1.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ళు వచ్చాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో జీఎస్టీ వసూళ్లు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందింది అనేందుకు ఇదే ఓ మంచి ఉదాహరణగా చెప్పుకోచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
అలాగే, భారత రిజర్వు బ్యాంకు ద్వారా సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. దీన్ని ఈ యేడాది నుంచే అమల్లోకి తీసుకునిరానుంది. రూపాయికి మరింత బలాన్ని ఇచ్చేలా ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. కరెనీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీని రూపకల్పన చేయనున్నారు. 
 
కాగా, బడ్జెట్ అంచనాలు 
2022-23 మొత్తం బడ్జెట్ అంచనా రూ.39.45 లక్షల కోట్లు
2022-23 బడ్జెట్‌లో మొత్తం ద్రవ్య లోటు అంచనా రూ.6.4 శాతం
2025-23 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం. 
2022-23 ఆదాయన వనరులు రూ.22.84 లక్షల కోట్లు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments