Webdunia - Bharat's app for daily news and videos

Install App

10లో రెండు అంకెలు ఉంటాయి... అవి 1, 0, ఏది ఇస్తారో మీ యిష్టం : చిదంబరం

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (13:00 IST)
లోక్‌సభలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికిగాను వార్షికబడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై విపక్ష పార్టీల నేతలంతా పెదవి విరించారు. ఈ క్రమంలో మాజీ విత్తమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఈ బడ్జెట్‌కు మీరిచ్చే ర్యాంకు ఏంటని మీడియా ప్రశ్నించింది. వీరికి దిమ్మతిరిగిపోయే సమాధానాన్ని ఇచ్చారు ఈ హార్వార్డ్ విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థి. 
 
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై 1 నుంచి 10 లోపు ఎంత స్కోరు ఇస్తారని చిదంబరంను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానమిస్తూ, "పది సంఖ్యలో రెండు అంకెలుంటాయి. అవి 1, 0. ఏది ఇస్తారో మీరే నిర్ణయించుకోండి" అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 
 
ఈ బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తిగా వ్యతిరేకించాల్సినవేనని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి లేకుండా వృద్ధిని ఎలా పెంచుతారని ఆయన ప్రశ్నించారు. డిమాండ్‌కు అనుగుణంగా పెట్టుబడుల ఆకర్షణకు చర్యలను ప్రకటించడంలో కేంద్రం విఫలమైందని నిప్పులు చెరిగారు.
 
"ఆర్థిక మంత్రి రెండు ప్రధాన సవాళ్లను మరిచిపోయారు. ఈ రెండు సవాళ్లను ఎలా అధిగమిస్తామన్న విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. ఇవి రెండూ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచేవే. దేశంలోని కోట్లాది మంది పేదలకు, మధ్య తరగతి వర్గాలకూ ఈ బడ్జెట్ ఏ విధమైన ఉపశమనాన్నీ కలిగించలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments