Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారావారిపల్లెలో అమరావతి పంచాయతీ.. హాజరుకానున్న ఆరుగురు మంత్రులు

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (12:15 IST)
రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ఎన్నో రకాలైన ఆందోళనలు చేస్తున్న ఏపీలోని వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునేలా లేదు. గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం రీ లొకేషన్ పేరుతో చీకట్లో జీవోలు జారీచేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వైకాపాకు చెందిన మంత్రులు మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా తొలి సభను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ సభకు ఆరుగురు మంత్రులు హాజరుకానున్నారు. 
 
ఈ సభను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, దాని వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వైసీపీ నేతలు వివరించి చెప్పనున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం ప్రారంభించారు. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసనకు దిగారు. వైసీపీ సభ, టీడీపీ నిరసన కార్యక్రమాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Adah Sharma: ఆదా శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదే.. క్యారెట్, ఎర్రకారం వుంటే?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ఓటింగ్ ట్రెండ్స్- డేంజర్ జోన్‌లో ఎవరు?

శివకార్తికేయన్‌పై రజనీకాంత్ ప్రశంసలు.. యాక్షన్ హీరో అయిపోయావంటూ కితాబు

Thaman: తెలుగు ఇండియన్ ఐడల్ షో గల్లీ టు గ్లోబల్ అయింది : అల్లు అరవింద్

కానిస్టేబుల్ ట్రైలర్ విశేష స్పందనతో సినిమాపై నమ్మకం వచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం