Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ నుండి అమలులోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:59 IST)
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లను మరింత సరళతరం చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో మరింత పోటీతత్వం పెరగాలన్నారు. సమగ్రమైన పంట విధానాలను అవలంబించాలన్నారు. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ కూడా అవసరమన్నారు. మోడల్ చట్టాలను అమలు చేసే రాష్ట్రాలను మరింత ప్రోత్సహించినున్నట్లు మంత్రి తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న వంద జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. 
 
సోలార్ పంపులను పెట్టుకునేందుకు సుమారు 20 లక్షల రైతులకు పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఈవమ్ ఉత్తన్ మహాభియాన్ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.
 
మరోవైపు విదేశీ పెట్టుబడుల గురించి మంత్రి మాట్లాడారు. 280 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రపంచంలోనే భారతదేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు. ఆయుష్మాన్ భవతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏప్రిల్ నుండి కొత్త జీఎస్టీ విధానం అమలులోకి రాబోతుందని చెప్పారు.
 
భారత్‌కు మరిన్ని పెట్టుబడులు రావాలని నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. మూడు లక్ష్యాలతో ముందుకు వెళుతున్నామని సబ్ కా సాత్, సబ్ కా వికాస్, న్యూ ఇండియా, ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో ముందుకు వెళుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments