రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలుగింటి కోడలు

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (10:02 IST)
కేంద్ర ఆర్థిక మంత్రిగా తెలుగింటి కోడలైన నిర్మలా సీతారామన్ కొనసాగుతున్నారు. ఈమె సారథ్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ బృందం 2020-21వ సంవత్సరానికిగాను బడ్జెట్‌ను రూపకల్పన చేసింది. ఈ బడ్జెట్‌ను నిర్మలాసీతారమన్ శనివారం మధ్యాహ్నం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, ఆర్థిక లోటుతో దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై దేశ ప్రజలు భారీ అంచనాలే పెట్టుకునివున్నారు. 
 
ఆదాయపన్ను పరిమితి పెంచుతారని, కర్షకుల సంక్షేమానికి మేలు చేసే పథకాలు ప్రవేశపెడతారని, ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా జనరంజక బడ్జెట్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anasuya Bharadwaj: నాగబంధం నుంచి లీలావతిగా అనసూయ భరద్వాజ్ లుక్

Ram Pothineni: 38వ పుట్టినరోజున దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న రామ్ పోతినేని

Puri Jagannadh: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విజయ్ సేతుపతి చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లో రోహిత్ సరాఫ్ షెడ్యూల్ పూర్తి

Veera Bhadrudu Review: సూర్య నటించిన వీర భద్రుడు సక్సెస్ అయ్యాడా? లేదా? వీరభద్రుడు రివ్యూ

తర్వాతి కథనం
Show comments