Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో వెలుగు చూసింది ఎక్స్ఈ వేరియంట్ కాదు : కేంద్రం

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:45 IST)
మహారాష్ట్రలోని ముంబైలో వెలుగు చూసిన కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, ముంబైలో వెలుగు చూసింది ఎక్స్ఈ వేరియంటేనని ముంబై మున్సిపాలిటీ అధికారులు అంటున్నారు. కానీ, కేంద్య శాఖ అధికారులు మాత్రం అందుకున్న భిన్నంగా చెబుతున్నారు. 
 
ఈ యేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూసిన విషయం తెల్సిందే. అయితే, గత రెండు నెలల్లో ఈ కేసు సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఒమిక్రాన్ బీఏ1, బీఏ2 వేరియంట్లు దేశంలో నమోదయ్యాయి. ఈ రెండింటి కలయికే ఎక్స్ఈ వేరియంట్. ఇది ఒమిక్రాన్ వేరియంట్‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించగలదని గుర్తించారు. బ్రిటన్‌లో ప్రస్తుతం అధిక సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల 50 యేళ్ల వయస్సున్న సౌతాఫ్రికా మహిళ ఇటీవల ముంబైకు వచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఆమె నమూనాలను సేకరించి కస్తూర్బా ఆస్పత్రిలోని కేంద్ర పరిశోధనాశాలకు పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఎక్స్ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు మహారాష్ట్ర స్టేట్  సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీఫ్ వెల్లడించారు. అయితే, ఈ వేరియంట్‌ను ఎక్స్ఈగా గుర్తించడం తొందరపాటు చర్యే అవుతుందని కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments