Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ తమిళసైని రాష్ట్రపతి పదవి వరించనున్నదా? ప్రధాని ఏం చెప్పారు?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (13:53 IST)
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరాజన్‌ను రాష్ట్రపతి పదవి వరించనున్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తర్వాత ఏ రాష్ట్ర గవర్నర్‌తోనూ సమావేశం కాలేదు. ఈ నేపధ్యంలో ప్రధానితో తెలంగాణ గవర్నర్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 
దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవిలో వున్నారు. ఐతే ఆర్.వెంకట్రామన్ తర్వాత రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారు దక్షిణాది నుంచి లేరు. కనుక తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరాజన్‌ను రాష్ట్రపతి పదవికి ఎన్డీయే ఎంపిక చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్-గవర్నర్ తమిళసైని ప్రోటోకాల్ విషయాల్లో పట్టించుకోవడంలేదన్న వాదనలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణ గవర్నర్ తమిళసైకి రాష్ట్రపతి పదవి చర్చ జోరందుకున్న నేపధ్యంలో దీనిపై క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments