అమ్మవారి నగలు దొంగలించి.. అలా ఇరుక్కుపోయాడు..

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (13:44 IST)
Thief
అమ్మవారి నగలు దొంగలించుకుని గుడిలో నుంచి బయటి వస్తామనుకున్న దొంగకు చుక్కలు కనిపించాయి. అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు  దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో ఊరికి చివరిగా జామి ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో దొంగతనం చేసేందుకు కంచిలికి చెందిన ఇసురు పాపారావు అనే వ్యక్తి మంగళవారం ప్రయత్నించాడు. 
 
గుడి కిటికీ పగల గొట్టి  గుడిలోకి ప్రవేశించాడు.  అమ్మవారి విగ్రహానికి ఉన్న ఆభరణాలు ఇతర విలువైన  వస్తువులు దొంగిలించి తిరిగి అదే కిటికీ నుంచి బయటకు  వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ లోపలకు వెళ్లిన పాపారావు బయటకు రాలేకపోయాడు. తిరిగి వెనక్కిదిగలేక కిటికీలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు.
 
ఇంతలో గ్రానస్థులు పాపారావు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే లోగా పాపారావు పరిస్ధితిని వీడియో తీసి తర్వాత బయటకు తీసి దేహశుధ్ది చేశారు. అనంతరం కంచిలి పోలీసులకు అప్పగించారు. పాపారావు మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments