Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానంద గాయబ్ : నిత్య వివాదాల స్వామీజీ ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (09:48 IST)
నిత్య వివాదాల స్వామీజీగా గుర్తింపు పొందిన నిత్యానంద కనిపించడం లేదు. ఆధ్యాత్మిక ముసుగులో ఆశ్రమంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన గత కొన్ని రోజులుగా బెంగుళూరు ఆశ్రమంలో కనిపించడం లేదు. దీంతో ఆయన విదేశాలకు పారిపోయాడనే ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి నిత్యానంద స్వామీజీపై నమోదైన పలు కేసులతో పాటు అత్యాచార కేసు దర్యాప్తు వేగవంతమైంది. అదేసమయంలో ఆయన పాస్‌పోర్టు కాలపరిమితి కూడా ముగిసింది. దీంతో ఆయన కేమన్ ఐల్యాండ్‌కు పారిపోయివుంటాడని కొందరు అంటుంటే మరింకొందరు మాత్రం తపస్సు కోసం హిమాలయాలకు వెళ్లారని అంటున్నారు. 
 
కానీ, ఆయన కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. పైగా బెంగుళూరు ఆశ్రమంలో కూడా లేరు. దీంతో ఆయన ఖచ్చితంగా దేశం విడిచి పారిపోయివుంటారని స్థానికులు అంటున్నారు. కానీ, ఆయన శిష్యులు మాత్రం అలాంటిదేం లేదనీ, ఆయన ఆధ్యాత్మిక చింతనలో భాగంగా హిమాలయాలకు వెళ్లారని అంటున్నారు. ఇదే విషయంపై పోలీసులు స్పందిస్తూ, నిత్యానందకు సంబంధించిన సమాచారమేదీ తమవద్ద లేదని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

ఈ ఏడాది సక్సెస్ లు పెద్దగా లేవు, పారితోషికం గురించి అందరూ ఆలోచించాలి: దిల్ రాజు

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments