Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని కాటేసిన పాము.. చివరికి ఏమైందంటే?

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (20:10 IST)
పాములు ప్రమాదకరమైనవే. కాటేస్తే గంటల వ్యవధిలోనే చనిపోవడం ఖాయం. కానీ బీహార్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. నాగు పాము కాటేసినా ఓ బాలుడికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఆ కాటేసిన పాము మాత్రం క్షణాల్లోనే చనిపోవడం విచిత్రంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని మాధోపూర్ గ్రామానికి చెందిన అనూజ్ (4) తన మామ ఇంటికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం అక్కడ పిల్లలతో ఆడుకుంటుండగా పొలం వైపు నుంచి ఓ విషపూరితమైన నాగు పాము వచ్చి పాదంపై కాటు వేసింది. 
 
అయితే అది గమనించిన స్థానికులు బాలుడి కుటుంబానికి సమాచారం అందించారు. ఆ పామును చంపడానికి దాని వెనకాల పరుగులు తీశారు. కానీ, అందరూ పాము వద్దకు చేరుకునేలోపు అది చనిపోయింది. 
 
ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. 
 
పాము కాటుకు గురైన అనూజ్‌కు ఏమి కాకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ పాము చనిపోవడం మిస్టరీగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments