Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని కాటేసిన పాము.. చివరికి ఏమైందంటే?

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (20:10 IST)
పాములు ప్రమాదకరమైనవే. కాటేస్తే గంటల వ్యవధిలోనే చనిపోవడం ఖాయం. కానీ బీహార్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. నాగు పాము కాటేసినా ఓ బాలుడికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఆ కాటేసిన పాము మాత్రం క్షణాల్లోనే చనిపోవడం విచిత్రంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని మాధోపూర్ గ్రామానికి చెందిన అనూజ్ (4) తన మామ ఇంటికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం అక్కడ పిల్లలతో ఆడుకుంటుండగా పొలం వైపు నుంచి ఓ విషపూరితమైన నాగు పాము వచ్చి పాదంపై కాటు వేసింది. 
 
అయితే అది గమనించిన స్థానికులు బాలుడి కుటుంబానికి సమాచారం అందించారు. ఆ పామును చంపడానికి దాని వెనకాల పరుగులు తీశారు. కానీ, అందరూ పాము వద్దకు చేరుకునేలోపు అది చనిపోయింది. 
 
ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. 
 
పాము కాటుకు గురైన అనూజ్‌కు ఏమి కాకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ పాము చనిపోవడం మిస్టరీగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments