Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ పుట్టింది, కానీ రాయిలా మారుతోంది, తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

Webdunia
శనివారం, 3 జులై 2021 (18:53 IST)
కన్నబిడ్డను కళ్లారా చూడగానే తల్లిదండ్రులు పొంగిపోతారు. ఈ ఏడాది జనవరి 31న పుట్టిన చిన్నారిని చూడగానే ఆ తల్లిదండ్రులు కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ 5 నెలలు గడిచాక పాపలో ఏదో తేడా వస్తున్నట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పాపకు అరుదైన వ్యాధి సోకిందనీ, ఈ కారణంగా ఆమె క్రమంగా రాయిలా మారుతుందని షాకింగ్ వార్త చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే... యూకెలోని హేమెల్ హెంప్‌స్టెడ్ ప్రాంతంలో అలెక్స్, దవే దంపతులు వుంటున్నారు. వీరికి గత జనవరిలో పాప పుట్టింది. ఈ బేబీకి 5 నెలల తర్వాత కాలిబొటనవేళ్లు రెండు అతుక్కున్నట్లు అగుపించాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా పాపకు ఎఫ్ఓపి అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిపారు వైద్యులు.
 
ఈ జబ్బు 20 లక్షల మందిలో ఒకరికి వస్తుందన్నారు. ఈ జబ్బు కారణంగా శరీరంలో ఎముకలు పెరుగుతూ పోతుంటాయి. ఫలితంగా కొన్నాళ్లకి పాప కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. వీరి జీవితకాలం 40 ఏళ్లకు మించదు. 20 ఏళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వుంటుంది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు అధైర్యపడలేదు. తమ చిన్నారికి చికిత్స చేయించి ఎలాగైనా మామూలు స్థితిలో వుంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments