Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు ధారపోసినా క‌త్తి మ‌హేష్ క‌న్నుమూత‌

Webdunia
శనివారం, 10 జులై 2021 (23:23 IST)
న‌టుడు. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కన్ను మూశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కత్తి మహేష్ మృతి చెందారు. గ‌త కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న మ‌హేష్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆయ‌న బ‌తికి బ‌య‌టికి వ‌స్తార‌ని చాలా మంది అనుకున్నారు.

కానీ, ఆయ‌న ఆరోగ్యం ఆసుప‌త్రిలోనే విష‌మించి మ‌ర‌ణించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ మృతిపై ప‌లువురు ధిగ్భాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. జూన్ 26 న తెల్లవారుఝూమున ఆయన ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ప్ర‌మాదానికి గుర‌యింది.

ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్‌ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం  చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  కత్తి మహేష్ కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధినుంచి రూ. 17లక్షల రూపాయలు అందచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments