పెళ్లైన ఆరు నెలలకే తేజ్ ప్రతాప్ యాదవ్-ఐశ్వర్యారాయ్ విడాకులు.. ఎందుకు?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (13:55 IST)
పెళ్లైన ఆరు నెలలకే బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భార్య ఐశ్వర్యారాయ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పట్నా కోర్టులో శుక్రవారం ఆయన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం దరఖాస్తు చేయడం ప్రస్తుతం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఐశ్వర్య తల్లిదండ్రులు ఈ విషయం గురించి చర్చేందుకు లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంటికి వెళ్లడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ విషయంపై కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు నచ్చచెప్పినప్పటికీ.. తేజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని సమాచారం. ఈ విషయంపై తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబసభ్యులు ఎవరూ స్పందించడానికి ఇష్టపడలేదు.
 
కాగా.. ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ యాదవ్ లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. తేజ్, ఐశ్వర్యల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగానే వారు విడిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. వారు వారి బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదని చెప్పారు. 
 
దీంతో.. హిందూ చట్ట ప్రకారం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. కాగా ఈ ఏడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యారాయ్‌ల వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీ ఎత్తున అతిథులు హాజరైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

15 యేళ్ళుగా ఆ నొప్పితో బాధపడుతున్నా : అక్కినేని నాగార్జున

Legendary Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి లేదా కీర్తి సురేష్?

మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా పోలీస్ కంప్లైంట్ టీజర్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments